తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్ల ట్రెండ్ ఇప్పుడు ఒక రేంజ్లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఖుషి’, ‘ఒక్క మగాడు’, ‘చెన్నకేశవ రెడ్డి’, ‘ఒక్కడు’ , రీసెంట్ గా ఖలేజా వంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలై కనీసం 3–5 కోట్లు వసూలు చేసాయి. ఈ నేపథ్యంలో పాత సినిమాలకు కొత్తగా ప్రాణం పోసే ప్రయత్నాలు కొన్ని మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఇప్పుడు అదే దారిలో ఓ వినూత్న ప్రయోగం చేస్తున్నారు – బాలకృష్ణ నటించిన మాస్ బ్లాక్బస్టర్ ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్ అవుతోంది. కానీ ఈసారి కేవలం మళ్లీ ఆ సినిమాని యాజటీజ్ స్క్రీన్ పై అందిచటం కాదు… ఓ కొత్త పాటను జోడించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశారు!
పాత సినిమా – కొత్త పాట? ఎలా సాధ్యమైంది?
‘లక్ష్మీ నరసింహా’ సినిమా కోసం అప్పట్లో ఓ పాటను చిత్రీకరించారు. కానీ ఫైనల్ ఎడిటింగ్ సమయంలో ఆ పాటను తీసేశారు. ఇప్పుడు రీ-రిలీజ్ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆ ఫుటేజ్ను తిరిగి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది — విజువల్స్ ఉన్నాయి, ఆడియో లేదు! దాంతో పాటను మళ్లీ క్రియేట్ చేయాల్సివచ్చింది. మ్యూజిక్ కంపోజర్ థమన్ శిష్యుడు భీమ్స్ సిసిరోహ్ పాటకు మ్యూజిక్ ఇచ్చాడు. లిరిక్స్ రాసిన వారు మరో మాస్ మాస్టరు – చంద్రబోస్!
పైగా ఈ పాట మాంటేజ్ కాదు… డాన్స్ మూమెంట్స్, లిప్ సింక్ ఉన్న వీడియో! దానికి తగ్గట్టుగా ట్యూన్ కూర్చేయడం అసాధారణమైన పని. ఈ ప్రయోగం ఒకటే చెబుతోంది — తెలుగు నిర్మాతలు ఇప్పుడు రీ-రిలీజ్లను కేవలం “నోస్టాల్జియా”కి కాకుండా, “న్యూ ఎక్స్పీరియెన్స్”గా మార్చాలని చూస్తున్నారు.